టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో తాజాగా కార్తికేయ 2 మూవీ తో పన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను కొల్లగొట్టింది. కార్తికేయ 2 మూవీ కి 100 కోట్లకు పైగా కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా లభించాయి. ఈ మూవీ తో నిఖిల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , పల్నాటి సూర్య ప్రతాప్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై ఈ మూవీ ని బన్నీ వాసు , అల్లు అరవింద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యూనిట్ ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ నుండి మొదటి సాంగ్ "నన్నయ రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి గోపి సుందర సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: