మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఇప్పటికి అనేక భాషల సినిమా లలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ అన్ని సినిమాలలో కూడా సాంప్రదాయబద్ధమైన పాత్రలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ హీరో గా తెరకెక్కిన ఫిదా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సాయి పల్లవి తన నటన తో , డాన్స్ తో , అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. సాయి పల్లవి ఆఖరిగా తెలుగు లో దగ్గుపాటి రానా హీరోగా తెరకెక్కిన విరాట పర్వం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ నటిస్తున్న ఓ మూవీ లో సాయి పల్లవి కి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా , సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: