చిత్రపరిశ్రమలో కొన్నిసార్లు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో హద్దులు మీరుతుండటం చూస్తుంటాం. గ్లామర్ పరంగా అంత షో చేయడం అవసరమా లేదా అనేది వారికే తెలియాలి. సినిమాలలో సాంగ్స్ కోసం, సీన్ డిమాండ్ కోసం అందాలను షో చేయడంలో ఓకే. పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు కూడా ఈ మధ్య అందాల షోలు ఎక్కువైపోతున్నాయి. అది చూసేవారికి, చూపించేవారికి అభ్యంతరం లేకపోవచ్చు. కానీ, అదే శృతిమించిన గ్లామర్ షో కొన్నిసార్లు కాంట్రావర్సీలకు దారితీస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి.. టాప్ టు బాటమ్ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జాన్వీ.. తాజాగా జరిగిన నైకా అవార్డుల వేడుకలో పాల్గొని సందడి చేసింది. అయితే.. ఈ వేడుకలో బికినీకి మించిన అందాలను షో చేయలేదు. కానీ, ఉన్నంతలో అన్ని కనిపించేలా షో చేసింది ఈ బ్యూటీ. గోల్డెన్ ఎల్లో మిక్స్ చేసిన రంగులో స్టైలిష్ ట్రెండీవేర్ తో నైకా అవార్డ్స్ లో ప్రత్యక్షమైంది జాన్వీ. ఈ క్రమంలో చేతిలో అవార్డు పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. మామూలుగా పబ్లిక్ ఫ్యాషన్ వీక్స్ లో జాన్వీ ఇంత షో చేయడం ఎప్పుడూ చూసి ఉండరు. కాగా.. ప్రెజెంట్ జాన్వీ హాట్ పోజులు, ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

ఇక ఇదే ఈవెంట్ లో జాన్వీ కపూర్ తో ఎంతోమంది స్టైలిష్ హాట్ డ్రెస్సింగ్ తో హాజరయ్యారు. అయితే.. జాన్వీ తర్వాత అంతటి హాట్ నెస్ తో ఆకట్టుకుంది ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్. ఇదిలా ఉండగా.. అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసింది. కానీ. సాలిడ్ హిట్ మాత్రం పడలేదని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ లో కూడా డెబ్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో 20 మిళియన్స్ కి పైగా ఫ్యాన్ ఫాలోయర్స్ ని కలిగిన జాన్వీ.. తెలుగులో ఎప్పుడు, ఏ హీరో సరసన డెబ్యూ చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి జాన్వీ కపూర్ గ్లామర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: