టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న తెలుగు, తమిళ్ బైలింగ్వల్ చిత్రం వారసుడు.. తెలుగులో వారసుడు పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ్లో వరిసు పేరిట రిలీజ్ చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ ఈ సినిమా ముందుగా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళగా.. ఆయన కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మహేష్ బాబు దగ్గరికి వెళ్ళగా ఆయన సినిమా డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకు తమిళ్ హీరో విజయ్ దగ్గరకు వెళ్లి ఈ కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం . అయితే ఈ సినిమాలో నటించడానికి ఆయన ఏకంగా 120 కోట్ల రూపాయల పారితోషకం అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే దిల్ రాజు తన ప్రొడక్షన్ సంస్థను కోలీవుడ్ లో కూడా విస్తరించడానికి డబ్బులను అక్కడి స్టార్ హీరోలకు ఎరగా వేస్తున్నాడని తెలుస్తోంది.  ఈ క్రమంలోని విజయ్ అడిగినంత డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు దిల్ రాజు.  అలా ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ వారసుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల చేయబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. అయితే సినిమాను త్వరలోనే రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఆడియో లాంచ్ డేట్ కూడా ప్రకటించారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి వరిసు ఆడియో లాంచ్ ప్రారంభం కాబోతోంది.

ఈవెంట్ ఎక్కడ అనే విషయానికి వస్తే.. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి జరగబోతుందని సమాచారం. ఇకపోతే ఈ ఆడియో లాంచ్ ను జనవరి ఒకటవ తేదీన ఆదివారం రోజు సన్ టీవీలో న్యూ ఇయర్ స్పెషల్ గా ప్రసారం కానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: