సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల కెరియర్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనదైన మార్కును సంపాదించగలిగితే కెరియర్ పరంగా వారు స్టార్ డం అందుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి కెరియర్ మొదట్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.అలాంటివారు చాలామంది ఉన్నారు. కానీ అద్భుతం జరిగిన వారిలో కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఉన్నారు వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ గతంలో కొన్ని సినిమాలను వదిలివేయడం జరిగింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో సమంతకు ముందు అనుపమని అనుకున్నారు. ప్రేమమ్ వంటి క్లాసికల్ మూవీ ని చూసిన సుకుమార్ రామ్ లక్ష్మి పాత్ర కోసం తనని ఎంపిక చేసుకోవాలనుకున్నారు కానీ తను అప్పటికి డైరెక్టర్ క్రేజ్ ని గుర్తించలేకపోవడంతో ఆడిషన్ లో భయపడడంతో ఈ సినిమాని వదులుకోవడం జరిగింది. అప్పటినుంచి స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఎంత ప్రయత్నించినా కూడా కాలేకపోయింది. నిఖిల్ తో కలిసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రమైన కార్తికేయ -2 లో నటించి తన పాత్రకు మంచి పేరు తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు మళ్లీ నిఖిల్ తో 18 పేజీస్ అనే చిత్రంలో నటించి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాని కూడా సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందిని పాత్ర ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇమే నటిన అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై అనుపమాకు టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన 18 పేజీస్ సినిమా ఏ విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాపడుతుందో చూడాలి మరి. మరి రాబోయే సినిమాల విషయంలో అనుపమ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని నటిస్తుందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: