బాలకృష్ణ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పెద్ద ఎత్తున సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 6వ తేదీన సాయంత్రం ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని చిత్రబృందం సన్నాహాలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే వార్త ప్రశ్నార్ధకంగా మారింది.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను సంప్రదించగా తన సినిమా పనులు.. రాజకీయ పనులను పక్కనపెట్టి మరీ బాలయ్య కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారని సమాచారం. ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా ఈ సినిమా వైపు తిప్పుకోవాలని ఆలోచనలో నిర్మాతలు ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది వర్క్ అవుట్ అవుతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే..