నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపో తున్నారు. స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టించే రేంజ్ లో బ్రేక్ లేకుండా సినిమాలను అనౌన్స్ చేస్తూ వరుసగా సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న బాలయ్య దూకుడు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ బడా నిర్మాణ సంస్థ అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలకృష్ణ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్,  టీజర్ పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పెద్ద ఎత్తున సన్నహాలు చేస్తున్నారు.  ఈ క్రమంలోనే జనవరి 6వ తేదీన సాయంత్రం ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని చిత్రబృందం సన్నాహాలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.


ఇప్పుడు ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే వార్త ప్రశ్నార్ధకంగా మారింది.. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను సంప్రదించగా తన సినిమా పనులు.. రాజకీయ పనులను పక్కనపెట్టి మరీ బాలయ్య కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారని సమాచారం.  ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా ఈ సినిమా వైపు తిప్పుకోవాలని ఆలోచనలో నిర్మాతలు ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది వర్క్ అవుట్ అవుతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: