నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఈ సినిమాని నూతన దర్శకుడితో చేస్తున్నాడు నాని. దసరా తర్వాత నాని చేస్తున్న ఈ సినిమాపై ఎనౌన్స్ మెంట్ తోనే సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమాని సివి మోహన్ తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో నాని 30వ సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అవడంతో హీరోయిన్ గా మృణాల్ అయితే పర్ఫెక్ట్ అని నాని సలహా ఇచ్చాడట. నాని చెప్పిన మాట ప్రకారమే మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సీరియల్స్ చేసి అక్కడ సత్తా చాటి సినిమా ఛాన్స్ లు అందుకున్న మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేసింది. నూర్జహాన్, సీతామహాలక్ష్మి పాత్రల్లో మృణాల్ సహజ నటన ఆడియన్స్ ని మెప్పించింది.

అందుకే నాని తన సినిమాలో ఆమె అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని మృణాల్ ని తీసుకున్నాడట. నాని, మృణాల్ జోడీ చాలా నేచురల్ గా పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక కొత్త దర్శకుడు కథని నమ్మి నాని మరోసారి రిస్క్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. శ్యాం సింగ రాయ్ తర్వాత అంటే సుందరానికీ నిరాశపరచగా త్వరలో దసరాతో మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు నాని. తన కెరీర్ లో దసరా లాంటి సినిమా తనని చాలా ఎగ్జైట్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు నాని. మరి అదే ఆసక్తి ఆడియన్స్ లో కూడా కలిగితే దసరా సెన్సేషన్ సృష్టించే ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాత వచ్చే నాని 30వ సినిమా కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: