వచ్చే సంక్రాంతికి ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చాలా రోజుల తరువాత పోటీ పడుతున్నారు. సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మరో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు సందడి చెయ్యడానికి రాబోతున్నాడు.నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి సినిమాలో హాట్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో దునియా విజయ్ ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా మీద కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండడం వల్ల ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.


అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ శృతిహాసన్ కావడం రెండు సినిమాలను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించడం ఆసక్తికరం.ఇక ఈ రెండు సినిమాలు కూడా కేవలం ఒకే రోజు వ్యవధిలో విడుదల చేస్తున్నారు. ఇందులో ముందుగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా జనవరి 13వ తేదీన విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా ఆ హీరోల ఫ్యాన్స్ పోలికలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి మూడు పాటలు విడుదల కాగా పాటలు విషయంలో మెగాస్టార్ చిరంజీవి పాటలకే ఎక్కువ వ్యూస్  వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వున్న ట్రెండ్ ని బట్టి చూస్తే బాలయ్యకే ఎక్కువ ఓపెనింగ్స్ నమోదయ్యేలా కనిపిస్తున్నాయి. డానికి కారణం బాలయ్య గత చిత్రం అఖండ చాలా పెద్ద విజయం సాధించడమే. అందువల్ల ఈసారి వాల్తేరు వీరయ్య సినిమా కంటే వీర సింహ రెడ్డి సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ నమోదయ్యేటట్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: