
ఈ క్రమంలోని సినిమా విడుదలను ఆలస్యం చేస్తూ వస్తున్నారు చిత్రబృందం. ఇక వీఎఫ్ఎక్స్ పనులలో బిజీగా ఉన్న చిత్ర బృందం కేవలం ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గడ్డం కోసమే రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమా వీ ఎఫ్ ఎక్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని కూడా సమాచారం. అయితే రోజురోజుకు ఇలా నిర్మాణాంతర పనులు పెండింగ్లో ఉండడం వల్ల సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులే కాదు దేశ ప్రజలు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఆలస్యం చేయడం సినిమాకి వరం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకెళితే 2024 జనవరి ఒకటవ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంతో దేశం మొత్తం హిందుత్వమూడులో ఉంటుంది. అలాంటి సమయంలో సంక్రాంతి కానుకగా స్లాట్ ను ఫిక్స్ చేసుకొని సినిమా విడుదల చేస్తే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని డేట్ లాక్ చేసుకోబోతున్నారు నిర్మాతలు. మరి వారి ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.