టాలీవుడ్ ని ఏలిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తుండగా, జనవరి 13 వ తేదీన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బాబీ మంచి ఊరమాస్ కంటెంట్ తో తీసుకొస్తుండగా మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత ఇలాంటి మాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమాతో ఆయన ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.ఈ మూవీ ట్రైలర్‌ను మరికొద్ది గంటల్లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.


మెగాస్టార్ చిరంజీవి గత మూడు చిత్రాల శాటిలైట్ రైట్స్‌ను కూడా ఈ ఛానల్ సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా శాటిలైట్ రైట్స్ కోసం భారీ ధరని ఆఫర్ చేసిందట. దీంతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ మూవీని కూడా జెమిని టీవీలోనే బుల్లితెర ప్రేక్షకులు చూడనున్నారు.ఇక వాల్తేరు వీరయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ చాలా రిచ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వాల్తేరు వీరయ్య సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే జనవరి 13 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: