తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న అజిత్ తాజాగా తమిళంలో రూపొందిన తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మంజు వారియర్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... బోనీ కపూర్మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు.

ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా జనవరి 11 వ తేదీన ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. తెలుగు లో ఈ సినిమాను తెగింపు అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రేంజ్ లో థియేటర్ లు దక్కాయి.

కానీ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి ... ఆ తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల కావడం ... అలాగే తాజాగా తమిళ హీరో విజయ్ హీరోగా రూపొందిన వారసుడు సినిమాను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావడంతో తెగింపు మూవీ కి థియేటర్ ల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. అందులో భాగంగా ఈరోజు తెగింపు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 50 థియేటర్ లలో మాత్రమే ప్రదర్శించబడుతుంది. ఇలా అతి తక్కువ థియేటర్ లలో ఈ మూవీ ఈ రోజు ప్రదర్శించబడడంతో ఈ మూవీ కి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ కలెక్షన్ లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: