నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ కొంత కాలం క్రితమే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టాడు. అలా అఖండ మూ వీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా , శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హనీ రోజ్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ లో కలక్షన్ లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టడం మాత్రమే కాకుండా ప్రస్తుతం కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విజయోత్సవ సభను "వీరసింహుని విజయోత్సవం" పేరుతో ఈ నెల 22 వ తేదీన జే ఆర్ సి ... హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్  దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ గల పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: