పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందాడు. ఈ సినిమాతో గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి తర్వాత సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కోసం అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇది వరకు ఎన్నడూ చూడని భారీ అడ్వెంచర్ కథ మహేష్ కోసం రెడీ అవుతుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటి దాకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా మహేష్ బాబు సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చి చక్కర్లు కొడుతోంది.ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. 1 నేనొక్కడినే సినిమా లాగానే ఈ సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంతో తీయబోతున్నాడు అని గట్టిగానే వినిపిస్తుంది.


సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాతో రాజమౌళి ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం ‘ సర్కారు వారి పాట ‘ సినిమాతో మరో 200 కోట్ల సూపర్ హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అంతకుముందే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడు ఇంకా ఖలేజా సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు కూడా  టాక్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాయి.ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ మూడో సినిమా రాబోతుంది. మళ్ళీ ఈ  కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇంకా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: