ప్రస్తుత కాలంలో ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ కి జనాల నుంచి ఆదరణ ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పటి దాకా సస్పెన్స్ థ్రిల్లర్స్, సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఓటీటీ కంపెనీలు ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి టాక్ షోస్ కూడా తీసుకువస్తున్నాయి.ఇప్పటికే తెలుగు ఓటీటీ ప్లాట్ఫారం అయిన ఆహా నిర్వహిస్తోన్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షో మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సెకండ్ సీజన్ కూడా ఊహించని రేంజిలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాకతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా సూపర్ గా స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా ప్రముఖ సింగర్ స్మిత కూడా త్వరలో నిజం విత్ స్మిత్ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెలబ్రెటీల వ్వక్తిగత ఇంకా అలాగే వారి కెరియర్ విషయాల గురించి ఈ షోలో ప్రస్తావించనున్నారు. అయితే ఈ షో మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ కాబోతుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పటి దాకా చిరు గురించి తెలిసినవి కాకుండా.. తెలియని విషయాలతోపాటు ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.


అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. గొప్ప స్టార్ డమ్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది. ఆ స్టేజీకి వెళ్లడానికి మీరు చాలా అవమానాలు పడి ఉంటారు. అవునా ? అని స్మిత అడగ్గా చిరంజీవి స్పందిస్తూ.. ఇక జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే నాపై కోడిగుడ్లు విసిరారు అంటూ తను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఎప్పుడూ కూడా బయటపెట్టని విషయాన్ని ఇప్పుడు చిరంజీవి చెప్పడంతో అసలు ఆయనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు ? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయం గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి. ఇంకా అలాగే చిరును స్మిత అడిగిన ప్రశ్నలు.. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆన్సర్స్ గురించి తెలుసుకోవాలంటే.. ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా ఇంకా అలాగే కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: