కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిన నటుడు సుహాస్.. తాజాగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్ .. ఈ సినిమాలో టీనా, శ్రీ గౌరీ ప్రియ, ఆశీష్ విద్యార్థి , రోహిణి గోపరాజు, రమణ తదితరులు కీలకపాత్రను పోషించారు.. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలయ్యి తొమ్మిది రోజులు అవుతున్నా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.. మొదటి రోజే భారీ రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ సినిమా మదర్ సెంటిమెంట్ పాయింట్ తో రూపొందించిన చిత్రంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతలు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షో వేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడి మంచి ఓపెనింగ్స్ లభించాయి.

రైటర్ పద్మభూషణ్ సినిమా తొలివారం కలెక్షన్ల విషయానికి వస్తే మొదటిరోజు రూ.65 లక్షలు.. రెండవ రోజు రూ.1.1 కోట్లు, మూడవరోజు రూ.1.2 కోట్లు, నాలుగవ రోజు రూ.50 లక్షలు, ఐదవ రోజు రూ.46 లక్షలు, ఆరవ రోజు రూ.35 లక్షలు, ఏడవ రోజు రూ.28 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. దాంతో మొదటివారం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సినిమా రూ. 4.5 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు రెండవ వారం కూడా నిలకడగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయింది ఈ సినిమా..


రెండవ వారం మొదటి రోజు రూ.30 లక్షల షేర్ రెండవ రోజు రూ.35 లక్షల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో సుమారు రూ.5.2 కోట్లు షేర్ వసూల్ చేసింది. ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ చిత్రం ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే అని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో , ముఖ్యంగా అమెరికాలో కూడా భారీగా కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. గత తొమ్మిది రోజుల్లో ఈ సినిమా అమెరికాలో మొత్తం రూ.మూడు కోట్లకు చేరువలో కలెక్షన్లు రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: