సినీ నటుడు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అక్కడున్న ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తారకరత్న మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనింది. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తో పాటు పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు కూడా దుఃఖంలోకి వెళ్లిపోయారు. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖుల సైతం తారకరత్నకు నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీంతో కొంతమంది అలేఖ్యాను కూడా పరామర్శించి ఓదార్చారు.



తారకరత్న మరణించారని వైద్యులు ధ్రువీకరించినప్పటి నుంచి ఆమె చాలా కంటతడి పెట్టుకోండి కుటుంబ సభ్యులు సన్నిహితులు సైతం ధైర్యం చెబుతూ తారకరత్న అకాల మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. మరొకవైపు ఆహారం కూడా తీసుకోకపోవడంతో ఒక్కసారిగా అస్వస్థకు గురైనట్లుగా సమాచారం. అలేఖ్య అస్వస్థకు గురైన విషయం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి స్పందించడం జరిగింది. ఇక ఆమె మానసిక ఒత్తిడికి లోనైనందువల్లే కాళ్లు చేతులు కొంచెం వనకడం మొదలయ్యాయని తెలిపారు విజయసాయిరెడ్డి అయితే ఆ ధైర్య పడవలసిన పనిలేదని అమితంగా ప్రేమించిన వ్యక్తి కోల్పోవడం చిన్న విషయం కాదని తెలిపారు.


కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే తారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అలేఖ్య రెడ్డికి ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నప్పటికీ తారక రత్నా ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల సైతం నిరాకరించడంతో ఒక గుడిలో వెళ్లి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అనుమతించారు. వీరికి 2013లో నీషిక అనే కూతురు జన్మించింది.ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు అందులో ఒక బాబు తమ రామ్ అని మరొక్క పాపకు రేయా అని పేరు పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: