టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్లలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. ఇక యూత్లో ఎక్కువగా బోల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట కుమారి-21F చిత్రం ద్వారా మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా క్రేజీతో మరిన్ని సినిమా అవకాశాలను అందుకుంది. అయితే హెగ్బా పటేల్ సినిమాల పరంగా క్రేజ్ సంపాదించడమే కాకుండా తన వ్యక్తిగతంగా కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులతో చాట్ నిర్వహిస్తూ పలు ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలోనే హెబ్బా పటేల్ ఒక ఈవెంట్ కు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది.హైదరాబాదులోని వెస్టిన్ హోటల్లో నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్.. అనే కార్యక్రమానికి ఇమే అతిథిగా కూడా వెళ్ళింది. ఈమెతో పాటు రకుల్, ప్రగ్య జైస్వాల్, మంచు లక్ష్మి, ప్రదీప్, నవదీప్ తదితరులు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈవెంట్ కు హాజరైన సందర్భంగా కొంత మంది సినీ తారల సైతం అక్కడ రాంప్ వాక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెగ్బా పటేల్ కూడా ర్యాంపు వాక్ చేసి అందరిని ఆకట్టుకోవడం జరిగింది.ఇక హెగ్బా పటేల్ బ్లాక్ లెహంగా ఓణీలో చాలా పద్ధతిగా కనిపిస్తోంది. రాంప్ వాక్ పైన చేస్తుంటే ఈమె అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయమైన దుస్తులను గ్లామర్ విందు కూడా చేస్తోంది హెబ్బా పటేల్. అదిరిపోయే నడకతో పాటు మతులు పోగొట్టే ఫోజులతో ఈ ముద్దుగుమ్మ టాప్ టు బాటమ్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది మరొకవైపు తన చూపులతో మైకం తెప్పించేలా చూస్తోంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది మరొకవైపు తమిళంలో ఒక సినిమా లో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: