హీరోయిన్ లకు మేకప్ అనేది చాలా  అవసరం . మేకప్ లేకుండా వాళ్ళు సినిమాలలో నటించడం కష్టమే.ఎందుకంటే మేకప్ తోనే వాళ్ళు ప్రేక్షకులను  ఆకర్షిస్తారు.

అయితే మేకప్ వేసుకోవడం వల్ల నటీనటుల చర్మాలు తొందరగా చెడి పోతూ ఉంటాయి.అంతేకాకుండా కొన్ని చర్మ వ్యాధులు కూడా వస్తాయి.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు మేకప్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా శృతిహాసన్ చర్మం కూడా ఒక రకమైన సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్. తన నటనతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకొని తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. పైగా సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు కాబట్టి ఈ బ్యూటీ కి ఇండస్ట్రీలో మంచి గౌరవం కూడా ఉంది. సినీ ఇండస్ట్రీకి శృతిహాసన్ చిన్న వయసులోనే అడుగుపెట్టి తన నటనతో మంచి గుర్తింపు ను తెచ్చుకుంది.

కొన్ని సినిమాలలో బాలనటిగా కూడా నటించిన తర్వాత హీరోయిన్ గా కూడా అడుగుపెట్టింది. ఈమె తొలిసారిగా హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం కాగా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అనగనగా ఓ ధీరుడు అనే సినిమా చేసింది. ఈ సినిమాలో తన నటనతో మార్కులు సంపాదించుకోగా ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారింది. అలా వరుస సక్సెస్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. గతంలో ఈ బ్యూటీ వ్యక్తిగతంగా మాత్రం  హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ప్రేమ విషయంలోనే. దానివల్ల కొంతకాలం సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చింది.ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్టులతో బిజీ గా వుంది.. ఈ బ్యూటీ ప్రస్తుతం శాంతాను హజారికా అనే ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది శృతి. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని వీడియోస్ ను పంచుకుంది. అందులో ఒక వీడియోలో తన ఫేస్ లో కళ్ళ కింద ఉన్న చర్మం భాగంపై ఎర్రని మొటిమలు కనిపించాయి

అంతేకాకుండా దాని గురించి కూడా ఆమె తెలిపింది. ఆ సమస్యతో తాను బాధపడుతున్నట్లు తెలిపింది. ఇక తన చర్మం అలా మారిపోవడానికి కారణం మేకప్ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: