మెగాస్టార్ వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ చరణ్ ఇక అంచనాలకు అందుకుంటూ ప్రతి సినిమాతో కూడా తనను తాను కొత్తగా నిరూపించుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన నటన తో తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డును దక్కించుకొని చరిత్ర సృష్టించడం ఖాయమని ఎంతోమంది తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.



 దీని కోసమే ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ మీడియాను కూడా ఆకట్టుకున్నారు. ఇకపోతే ఇటీవల మెగా వారసుడు రామ్ చరణ్ ఒక అరుదైన చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకి సాధ్యం కానీ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు రామ్ చరణ్. ప్రపంచ ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం అయినా గుడ్ మార్నింగ్ కి అమెరికా నుంచి రామ్ చరణ్ ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే ఈ షోలో పాల్గొని రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత అందుకున్న తొలి హీరో కేవలం రామ్ చరణ్ మాత్రమే కావడం గమనార్హం. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు.



ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తరకెక్కుతున్న ఆర్సి15 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా ముగిసిన వెంటనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక అటువంటినే మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు రామ్ చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: