తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని అవమానించి బాలీవుడ్ లో రాణించాలని  అక్కడికి వెళ్ళింది ఇలియానా. “బర్ఫీ, ఫటా పోస్టర్ నిక్లా హీరో, రుస్తోమ్, బాద్ షాహో” వంటి సినిమాలు హిట్ అయ్యి మంచి పేరే సంపాదించి పెట్టాయి. అయితే ఆ చిత్రాలన్నీ కేవలం హీరోల కారణంగా విజయం సాధించాయి. కానీ ఒక్కరూ కూడా ఇలియానా గురించి మాట్లాడలేదు. కానీ తెలుగులో “దేవదాస్, పోకిరి” వంటి చిత్రాల ఘనవిజయంలో మాత్రం అయస్కాంతం లాంటి ఇలియానా అందం చూసి యూత్ ఆమెని నెత్తిన పెట్టుకున్నారు. దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. కానీ ఇలియానా ఆ విశ్వాసం లేకుండా టాలీవుడ్ ని ఘోరంగా అవమానించి వెళ్ళిపోయింది.తీరా అక్కడ తన పని అయిపోయాకా ఇప్పుడు మళ్ళీ ఇలియానా చూపు టాలీవుడ్ వైపే సాగుతోంది.'దేవదాస్, పోకిరి’ చిత్రాల్లో ఇలియానా మిసమిసలాడే అందానికి టాలీవుడ్ జనం ఫిదా అయ్యారు. 


ఆ తరువాత కూడా ఇలియానా నటించిన “జల్సా, కిక్, జులాయి” వంటి సినిమాలు బాగానే అలరించాయి. తరువాత ఈ ముద్దుగుమ్మనూ ఫ్లాపులు బాగా అడ్డుకున్నాయి. ఇప్పుడు బొద్దుగుమ్మగా మారాక, ఆమెతో నటించిన స్టార్స్ మళ్ళీ జోడీ కట్టడానికి అస్సలు అంగీకరించరు. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలతో నటించాలన్న అభిలాషను వ్యక్తం చేస్తోంది ఇలియానా. పూరి జగన్నాథ్ ‘దేవుడు చేసిన మనుషులు’సినిమాలో రవితేజతో నటించాక, బాలీవుడ్ వెళ్ళిపోయింది ఈ భామ. మళ్ళీ ఆరేళ్ళ తరువాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’సినిమాలో మెరిసింది. కానీ, ఆ సినిమా కూడా కలసి రాలేదు. ఇప్పటికీ తమ తడాఖా చూపిస్తోన్న టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సినిమాలలో అవకాశాల కోసం ఈ హాట్ బ్యూటీ వేట ఆరంభించిందని సమాచారం.ఒకే ఒక్క ఛాన్స్ కోసం టాలీవుడ్ లో గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఈ హాట్ బ్యూటీ..

మరింత సమాచారం తెలుసుకోండి: