పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈమధ్య బన్నీ స్ట్రైట్ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడని వార్తలు బాగా వినిపించాయి. ఆమధ్య బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీల బన్సాలిని బన్నీ కలవడంతో ఆ వార్తలన్నీ నిజమే అనుకున్నారు. కానీ బన్నీ మాత్రం బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఇంకా సరైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ తోనే బన్నీ బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయబోతున్నారని లేటెస్ట్ గా ఓ న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇది సింగిల్ హీరో సినిమా కాదట..మల్టీ స్టార్ అని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రం అల్లు అర్జున్ ఒకేసారి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శిరవేగంగా జరుగుతోంది. అయితే మహేష్ని మాత్రమే అల్లు అర్జున్ తోనే ఓ సినిమా చేస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు. అయితే ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా మల్టీ స్టార్ ప్రాజెక్టు అని అంటున్నారు. మహేష్ సినిమా పూర్తయ్యే లోపు తన రైటింగ్ టీం ఓ కథను సిద్ధం చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని అంటున్నారు. ఇందులో బన్నీ తో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడట.

బాలీవుడ్ హీరో మరెవరో కాదు షాహిద్ కపూర్. త్రివిక్రమ్, బన్నీ, షాహిద్ కపూర్ ఈ ముగ్గురి కలయికలోనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే అది ఎప్పుడూ అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది . అల్లు అర్జున్ ఎలాగూ పుష్ప 2 తర్వాత మరో సినిమాకి కమిట్ కాలేదు. పుష్పటు అయిపోయే లోపు త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమాని పూర్తి చేసేస్తాడు. అటు షాహిద్ కపూర్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త సినిమాలు కమిట్ కాలేదు. కాబట్టి ఈ ముగ్గురి కలయికలో మల్టీ స్టారర్ మూవీ మాత్రం త్వరలోనే ఉండబోతుందని స్పష్టమవుతోంది. మరి ఈ ప్రాజెక్టు కనుక వర్కౌట్ అయితే బాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: