అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సంక్రాంతికి వీరసింహ రెడ్డి గా అలరించిన బాలయ్య తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్.బి.కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు అప్పట్లో నటించిన తమ సినిమాలలో సూపర్ హిట్ సాంగ్స్ ని మళ్లీ రీమిక్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమాలో 'ఎన్నో రాత్రులు వస్తాయి గాని' అనే పాటను రీమిక్స్ చేశారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి తన బోలా శంకర్ సినిమా కోసం 'రామ్మా చిలకమ్మా' అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మన బాలయ్య కూడా అదే దారిలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య కూడా తన పాత సినిమాల్లోని ఓ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయాలని అనుకుంటున్నాడట. తాజా సమాచారం ప్రకారం బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' సినిమా నుంచి 'అందాల ఆడబొమ్మ' అనే పాటను రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ పాటను తమన్ తనదైన వెర్షన్లో రీమిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. కాగా ఇటీవల తారకరత్న అకాల మరణం కారణంగా  సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. తారకరత్న మరణంతో బాలకృష్ణ ఎంతో కృంగిపోయారు. ఆ బాధ నుంచి బాలయ్య ఇంకా కోలుకోలేదు. అందుకే ఎన్బికె 108 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. తారకరత్న పెద్దకర్మ పూర్తయిన అనంతరం బాలయ్య తిరిగి తన సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. మరో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ చిత్రంలో బాలయ్యకు కూతురుగా కనిపించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: