టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక్కడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  అటు సినిమాలోనూ ఇటు రాజకీయాలోనూ ఫుల్ బిజీగా వున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఒకదాని వెంట మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తూ.. జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ బాగా బిజీ అయ్యాడు. ఈమధ్య వరుస సినిమాలని రిలీజ్ చేసి ఇంకా కొత్త సినిమాలని కూడా ప్రకటించాడు.'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ', 'వినోదాయం సీతం' రీమేక్ సినిమాలతో  అస్సలు క్షణం తీరిక లేకుండా వీలైనంత త్వరగా ఈ సినిమాలన్నిటినీ కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారు.. ఈ సినిమాలు పూర్తి చేసేదాకా రాజకీయాల వైపు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడు పవన్. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాక మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవ్వనున్నాడు పవన్. ఇక తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న మెగా మల్టీ స్టారర్ 'వినోదాయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది..ఈ సినిమాకి మెయిన్ కాస్టింగ్ కూడా ఫిక్స్ అయిపోయారు.. సుజిత్ దర్శకత్వంలో చేయబోయే 'ఓజీ' సినిమా రెండు భాగాలుగా వస్తుందని అంటున్నారు..


దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోంది.. ఇప్పుడు తనకు 'గబ్బర్ సింగ్' సినిమా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్‌తో చేయనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కి కూడా లైన్ క్లియర్ అయింది.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్న ఈ స్టైలిష్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కి పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది..తమిళ హీరో విజయ్ 'తెరి' రీమేక్ అంటున్నారు కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు భారీ మార్పులతో సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేశారట హరీష్ అండ్ టీం.. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తొలి విడతగా పది రోజుల డేట్స్ ఇచ్చారట.. ఏప్రిల్ 5 వ తేదీ నుండి ఫస్ట్ షెడ్యూల్ కోసం ఈ డేట్స్ అడ్జెస్ట్ చేశారాయన.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో కథానాయికగా ఫిక్స్ అయిపోయిందట.. ఇతర నటీనటులు ఇంకా అలాగే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: