బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే నటన ద్వారా పెద్దగా గుర్తింపు సంపాదించుకోని బండ్ల గణేష్.. ఏకంగా తన స్పీచ్ ల ద్వారా మాత్రం ఊహించిన రీతిలో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల క్రితం కమెడియన్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు. ఇక ఎన్నో ఏళ్లపాటు స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఇలా కమెడియన్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అని చెప్పాలి.


 ఆ తర్వాత మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు బండ్ల గణేష్. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించి నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అంతే కాదు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా నిర్మించాడు అని చెప్పాలి. గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలు, టెంపర్, బాద్షా లాంటి చిత్రాలతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు బండ్ల గణేష్.  కానీ గత కొంతకాలం నుంచి మాత్రం నిర్మాణ రంగానికి దూరంగానే ఉంటున్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరులో మరోసారి కమెడియన్ పాత్ర చేసి ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నించాడు.


 ఇదిలా ఉంటే బండ్ల గణేష్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ తెగ చక్కర్లు కొడుతుంది. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన టెంపర్ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ను సెట్ చేసే పనిలో ఉన్నాడట బండ్ల గణేష్. అయితే వీరి కాంబినేషన్లో గతంలో క్రాక్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక బండ్ల గణేష్ కూడా రవితేజ నటించిన ఆంజనేయులు సినిమాతోనే నిర్మాతగా కెరియర్ ప్రారంభించారు ఇక ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ రవితేజతో సినిమా చేసి ఇక రవితేజకు  బాగా కలిసి వచ్చిన గోపీచంద్ మలినేనిని దర్శకుడిగా పెట్టుకొని మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడట బండ్ల గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: