టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా మహేష్ అందాన్ని చూసి ఎంతోమంది నటీనటులు సైతం కుళ్ళుకుంటూ ఉంటారు. మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో చిత్రాలను వదులుకోవడం జరిగింది.ఇప్పటికీ కూడా పలు చిత్రాలు తన బాడీకి సెట్ కావానీ వదులుకోవడం జరిగింది. అలాంటి వాటిలో యానిమల్ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాని రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.


సందీప్ వంగ మొదటిసారి కలిసి యానిమల్ కథ చెప్పే సమయంలో చాలా సర్ప్రైజ్ గా అయ్యానని తెలిపారు రణబీర్ కపూర్. కథ విన్న తర్వాత రెస్ట్ రూమ్ కి వెళ్లి తనను తాను ఒకసారి అద్దంలో చూసుకొని చాలా భయపడ్డాను అని కెరియర్లో ఇలాంటి కథ పాత్ర చేయడం మొదటిసారి అని చాలా భయపడ్డాను ఈ కథకు నేను న్యాయం చేయగలనా అనిపించింది అని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య సాగే ఆసక్తికరమైన గ్యాంగ్ స్టర్ డ్రామాగా యానిమల్ సినిమా ఉంటుందని సమాచారం.


బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే సౌత్ సినిమాలలో  హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే బాలీవుడ్లో హింస చాలా తక్కువే అని చెప్పాలి హిందీ ప్రేక్షకులకు అభిరుచి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటూనే సౌత్ ప్రేక్షకులకు అభిరుచి తగ్గట్టుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. అయితే ఇలాంటి సినిమాను మహేష్ బాబు మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి యాక్షన్ డ్రామా తండ్రి కొడుకుల నేపథ్యంలో సాగే చిత్రం మహేష్ బాబుకు సెట్ అవ్వదని తెలిసే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: