రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే హిందీ దర్శకుడు అయినటువంటి ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ లో అత్యధికమైన వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ లు ఉండడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ కొంత కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ను విడుదల చేసింది.

మూవీ టీజర్ పై ప్రేక్షకుల నుండి కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ లభించింది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ లపై మరి కొంత కాలం పని చేయడానికి మరియు ఈ సినిమాను ఇంకా బెటర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి వి ఎఫ్ ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడంతో ఈ మూవీ జూన్ 16 వ తేదీన విడుదల కాపడం కష్టమే అని ఈ మూవీ విడుదలకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: