రాంగోపాల్ వర్మ సినిమాలలో కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించారు.. సినిమాలు, రాజకీయాలు సామాజిక అంశాల పైన ఇతర అంశాల పైన ఎక్కువగా స్పందిస్తూ తన మార్కు ను చాటుకుంటూ ఉంటారు. విషయం ఏదైనా సరే ఎక్కువగా తనదైన స్టైల్ లో ట్విట్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటారు వర్మ. వాస్తవానికి వర్మ మాట్లాడే ప్రతి మాట కూడా చాలా లాజిక్ గానే ఉంటుందని చెప్పవచ్చు.
తనకు నచ్చిన విషయం చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని ఆయన చేసే ట్విట్లను చూస్తే మనం చెప్పవచ్చు.. వాస్తవానికి తను చేసే పనులన్నీ కూడా అందరికీ నచ్చుతాయి.కానీ బయటకు మాత్రం చెప్పలేరు పైగా ఆయన పైన విమర్శలు చేస్తూ ఉంటారు కొంతమంది . తాజాగా వర్మ చేసిన ఒక ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ఈ రోజున రాంగోపాల్ వర్మ బర్తడే సందర్భంగా ఆయన బర్తడే శుభాకాంక్షలు అని ఎవరు చెప్పకూడదని ఆయన ట్విట్టర్లో తెలియజేశారు.. అలా చెప్పడం వల్ల అవి దేనికి పనికిరావు అంటూ కూడా రాసుకురావడం జరిగింది.
విషెస్ అనేది ఉచితమైనవి పనికిరానివి కూడా నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం అంటూ వర్మ ట్విట్ చేశారు.. వర్మ రీసెంట్ గా డిగ్రీ పట్టాను కూడా అందుకున్నారు 37 ఏళ్లలో ఆ సర్టిఫికెట్ తీసుకోవడం విశేషం.