మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఆరెంజ్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. ఈ సినిమా చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బాస్టర్ మూవీ మగధీర తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా ... నాగబాబు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. జెనీలియా ఈ మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ... హారిస్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇలా ఆ సమయంలో ప్రేక్షకులను అలరించడంలో అయిన ఈ సినిమాను ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎప్పటి నుండో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ మూవీ రీ రిలీజ్ కాగానే ఈ సినిమాను థియేటర్ లలో చూడడానికి అత్యంత ఆసక్తిని చూపించారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా టోటల్ గా నైజాం ఏరియాలో 1.96 కోట్ల కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 25 లక్షలు ... ఆంధ్ర లో 94 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 3.15 కోట్ల కలెక్షన్ లు లభించాయి. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 21 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.36 కోట్ల కనెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: