మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష.. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ తో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాగా విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోని ఈ సినిమా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది.


ఈ చిత్రానికి A సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రవితేజ యొక్క రావణాసుర సినిమాకు కూడా A సర్టిఫికెట్ లభించింది. అయితే చాలా అరుదుగా తెలుగు సినిమాలకు A సర్టిఫికెట్ లభిస్తోంది అందుకే అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయో తప్ప చిత్ర బృందం ఇంకా అధికారికంగా తెలుపలేదు. ఇందులో హీరోయిన్ పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లలో కనిపించబోతోంది.


మిస్టర్ త్రిల్లర్గా విచిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఈ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే కావడం గమనార్హం. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా మొదటిసారిగా పరిచయమవుతున్నారు. క్రైం తిరుమలే కాకుండా హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా అదిరిపోయే విధంగా ఉంటుంది అంటూ టాక్ వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. ఆన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 21వ తారీఖున అన్ని భాషలలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా థ్రిల్లర్ తో మెగా హీరో సక్సెస్ అందుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. వరుస విజయాలతో సక్సెస్ మీద ఉంది హీరోయిన్ సంయుక్త మీనన్.. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాదేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: