తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ... సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ... ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించగా ... ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 23 వ తేదీన వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గానీ లేదా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గాని వీలైతే ఇద్దరు ముఖ్య అతిథులుగా విచ్చేసి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా ఈ చిత్ర బృందం పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: