పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు..

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు.

2012లో గబ్బర్ సింగ్ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. మరి ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందట... పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఉస్తాద్ భగత్ సింగ్''  ఇన్నాళ్లకు మళ్ళీ ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిందట.. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేయడంతో మరింత హైప్ పెరిగిందట.ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ వచ్చింది... తమ మూవీ పవర్ ప్యాక్డ్ నెక్స్ట్ షెడ్యూల్ గురించి హరీష్ ఒక అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నాం అంటూ హరీష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ బోస్ లొకేషన్స్ సర్చింగ్ లో భాగంగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపారట... ఉస్తాద్ తో పాటు ఓజి సినిమాల అప్డేట్ లు కూడా వెంట వెంటనే రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఇళయ దళపతి విజయ్ నటించిన సూపర్ హిట్ తేరీ సినిమాకు అఫిషియల్ గా రూపొందుతుందట... movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.అలాగే శ్రీలీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: