టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ నటుడు రాజా వారు రాణి గారు మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ యువ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి కిరణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ నటుడు వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లలో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డిజె టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రీతీనం కృష్ణమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ ప్రోమో సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: