టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఇలా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరి ప్రేమ కథ తెరపై కూడా కనిపించబోతోంది. ఎం ఎస్ రాజు దర్శకత్వంలో రాబోతున్న మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జట్ట ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇక వీరిద్దరూ నటించిన ఈ సినిమా మే 26న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ సైతం మొదలుపెట్టారు. అయితే నేడు బెంగళూరులో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్ర బృందం. 

ఇక ఆ ప్రెస్ మీట్ లో భాగంగా నరేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలను చేయడంతో అవికాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నిజానికి కన్నడ ప్రెస్ మీట్ అంటే అక్కడున్నవారికి సినిమాలపై బాగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే పవిత్ర లోకేష్ కన్నడ నటి కాబట్టి. అక్కడి నుండే ఆమె తెలుగు సినిమాల్లోకి వచ్చింది. ఈ క్రమంలోని నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా నరేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నాలాంటి వాళ్లకి విడాకులపై ఎంతో ఊరటం ఇచ్చింది.. సహజీవనానికి పెళ్లికి సంబంధం లేదని.. అది వారి పర్సనల్ జీవితం అని చెప్పింది.. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చి నాలాంటి వారికి ఊరటను ఇచ్చింది..

హైదరాబాదులో ఆరు ఫ్యామిలీ కోర్టులో ఉన్నాయి.. ఇన్ని కోర్టులో ఉన్నాయంటే చాలా ఫ్యామిలీస్ హ్యాపీగా లేవని అర్థం పెళ్లి చేసుకున్న వారు చాలావరకు సంతోషంగా లేరు.. ఇక మా విషయానికి వస్తే.. నా మనసు పవిత్ర మనసు కలవడంతో మేమిద్దరం ఇప్పుడు కలిసి ఉన్నాం.. కలిసి ఉన్నాం కానీ ఇప్పటివరకు అయితే పెళ్లి మాత్రం చేసుకోలేదు.. త్వరలోనే చేసుకుంటాం.. దానికి కచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. అని చెప్పుకొచ్చాడు నరేష్. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది నా బయోపిక్ కాదు ట్రైలర్ చూసి అందరూ ఇది నా కథ అని అనుకుంటున్నారు.. కానీ కాదు.. ట్రైలర్ చూసి సినిమా అని అంచనాలు వేయొద్దు.. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: