మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రీసెంట్ గా విరూపాక్షతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. ఫైనల్ గా 100 కోట్ల కలెక్షన్స్ తో సాయి తేజ్ అదరగొట్టేశాడు. ఆఫ్టర్ యాక్సిడెంట్ అతను చేసిన ఈ తొలి అటెంప్ట్ ని మెగా ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఈ ఉత్సాహంతో సాయి తేజ్ మరిన్ని మంచి సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో బ్రో అంటూ వస్తున్నాడు సాయి తేజ్. మామతో స్క్రీన్ షేరింగ్ అది కూడా పవర్ స్టార్ తో అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఇద్దరు కలిసి బ్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ టైటిల్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ అని పేరు వేశారు. సో అఫీషియల్ గానే సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా మారాడని చెప్పొచ్చు. నిన్న మొన్నటిదాకా సాయి ధరం తేజ్ గా ఉన్న మెగా మేనల్లుడి పేరుని సాయి తేజ్ గా మార్చేశారు.

ఇక మీడియా అండ్ ఫ్యాన్స్ కూడా సాయి తేజ్ అనే పిలిచే అవకాశం ఉంది. సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న బ్రో సినిమా జూలై 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆల్రెడీ విరూపాక్ష హిట్ పడింది కాబట్టి సాయి తేజ్ కి ఈ సినిమా కచ్చితంగా హిట్ పడుతుందని చెప్పొచ్చు. తన పేరుని సాయి తేజ్ అని అనౌన్స్ చేస్తూ అఫీషియల్ గా చెప్పేశాడు. ఇక ఈ సినిమా తర్వాత సంపత్ నందితో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని టాక్. ఈ సినిమాలతో సాయి తేజ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మెగా హీరో ప్లానింగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: