గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రాజు నిన్నటి రోజున సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని తన గృహంలో కన్నుమూసినట్లు సమాచారం.దీంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఈయన మరణ వార్త విని సినీ ప్రముఖుల సైతం ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సైతం పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తెలియజేస్తూ ఉన్నారు. రాజ్-కోటి మంచి స్నేహితులు వీరిద్దరి తల్లిదండ్రులు టీవీ రాజు సాలూరి రాజేశ్వరరావు ఇద్దరు కూడా సంగీత దర్శకులే. వీరి రోజులు స్నేహితులుగా ఉండడం చేత రాజ్ - కోటి కూడా స్నేహితులుగా మారిపోయారు.
అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది.గతంలో ఇద్దరూ దీని గురించి ప్రశ్నిస్తే మేము వర్క్ పరంగా విడిపోయాము సంగీత దర్శకులుగానే విడిపోయాము అంతేకానీ ఎప్పటికీ స్నేహితులుగానే కలిసే మాట్లాడుకుంటామని తెలిపారు. అయితే వీరిద్దరిని కలపాలని సినీ ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు ట్రై చేసిన వీరు కలిసి పనిచేయలేదని సమాచారం. అయితే విడిపోయిన తర్వాత గతంలో రాజ్- కోటి లను చెన్నైలోని ఒక కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించారు ఆ తర్వాత కూడా ఏదో తెలిసిన వాళ్ళలాగా కనిపిస్తే మాట్లాడుకోవడం తప్ప పెద్దగా క్లోజ్ గా లేరు.