ప్రముఖ దర్శకుడు రాంగోపాల్వర్మ(ఆర్జీవీ)కు నల్గొండ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. నల్గొండలో హత్యకు గురైన ప్రణయ్ ప్రేమ వ్యవహారం ఆధారంగా రాంగోపాల్వర్మ ‘మర్డర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తమపై చిత్రీకరిస్తున్న సినిమాను నిలిపివేయాలంటూ ప్రణయ్ భార్య అమృత గత నెలలో కోర్టులో సివిల్ దావా వేసింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ‘మర్డర్’ సినిమాను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.