తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రానా గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలితో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తాజగా రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా విరాట పర్వం. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు రెండో సినిమాకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఎన్నుకున్నాడు.