తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్రమశిక్షణకు మారు పేరు అని తెలుసు..అంతే కాదు ఆయన తనయులు హీరోలుగా వస్తున్నా కూడా తండ్రి మాటకు ఎంతో విలువ ఇస్తారు..ఈ విషయాన్ని చాలా సార్లు మోహన్ బాబు చెప్పారు. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన ఈ నటుడు, తన డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మోహన్ బాబు అంటే నటసార్వ భౌములు ఎన్టీఆర్ కూడా చాలా అభిమానించే వారు..సొంత తమ్ముడిలా చూస్తూ ఎన్నో సినిమాల్లో మంచి చాన్సులు ఇప్పించారట.

ఇక దాసరి నారాయణ రావు ఆయనకు ఇప్పటికీ మంచి గురువుగానే అభిమానిస్తారు. తాజాగా మోహన్ బాబు ఓ విషయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యారట..అది కూడా ఓ లెటర్ చూసి కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయట..ఏడిచారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు..ఈ మద్య  ఓ న్యూస్ పేపర్ వారు ప్రాణం అవార్డును ప్రకటించారు. ఆ అవార్డు ఫంక్షన్ తర్వాత ఆయన ఓ లెటర్ ను చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారట..అంతే కాదు ఒక్కసారే కళ్లు చెమ్మగిల్లాయట.

మోహన్ బాబు డైలాగ్ బుక్స్ రిలీజ్


ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారనుకుంటున్నారా..ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త, మీడియా అధినేత  రామోజీరావు ఓ లెటర్ రాశాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియా మొఘల్ రామోజీరావు మోహన్ బాబును ప్రశంసిస్తూ ఓ లేఖను పంపారు. డైలాగ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరో నిజజీవింతంలోనూ హీరో అనదగ్గ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. మీరింకా మరెన్నో గౌరవాలను పొందాలని కోరుకుంటున్నాని ఆయన కాంక్షించారు. ఆ లెటర్ లో  తనను అభినందిస్తూ  రియల్ లైఫ్ హీరోలా వర్ణిస్తూ రాసిన లైన్ కన్నీరు పెట్టించాయట. ఆయన ప్రశంసలను మరచిపోలేను. జీవితంలో ఇంకా ఎన్నెన్నో సాధించాలనుకుంటున్నానని ట్విట్లర్ లో తెలియజేసిన మోహన్ బాబు ఈ సందర్భంగా డైలాగ్ బుక్ కు ముందు మాట రాసిన నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలను కూడా తెలియజేశారు.

మోహన్ బాబు ట్విట్స్ :

మరింత సమాచారం తెలుసుకోండి: