సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రౌత్‌. ఆమె సినిమా ఏం చేసినా సంచలనమే. ఏదో ఒక వివాదంలో తరచూ ఆమె పేరు నానుతూ ఉంటుంది.  ఈ భామ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో సమీరా గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో మాత్రం ఇరగదిస్తోంది.

 

ప్రస్తుతం ఆమె తమిళ నటి, రాజకీయవేత్త జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో జయలలిత పాత్ర చేస్తోంది. అంతేకాదు గత 14 ఏళ్ల సినీ ప్రయాణంలో మరపురాని పాత్రలెన్నో చేసింది. అందులో భాగంగా నటిగా పలుమార్లు నేషనల్‌ అవార్డులు సైతం అందుకుంది. కంగనా గతేడాది నటించిన మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది.

 

ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మిబాయ్‌గా కంగన అద్భుతంగా నటించిందనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాకు కొంత భాగం దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమే తీసుకుంది. ఇటీవల  కంగన నటించిన చిత్రం పంగా .  జనవరి 24న విడుదలైన ఈ సినిమా నటిగా తన సత్తాని చాటిచెప్పింది. ఆ సినిమాలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నాయి. ప్రస్తుతం తైలవి షూటింగ్‌లో ఉన్న ఈ భామ రామేశ్వరంలోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా కంగనా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Kangana in Rameshwaram this morning! After getting Sita back from Lanka, Rama established this Shivlingam to absolve him of the sin committed as he killed Ravana a great shiva devotee. This is also one of the four Dhams. 🙏

A post shared by kangana Ranaut (@team_kangana_ranaut) on

మరింత సమాచారం తెలుసుకోండి: