తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా బాలీవుడ్ నటుల హవా బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలిగిపోయిన వారు... ఇప్పుడు ఇతర భాషల్లో విలన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే జాకీ ష్రాఫ్ విలన్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘రోబో 2.0’ చిత్రంలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. ఇక సునీల్ శెట్టి కూడా ఈ మద్య పలు ఇతర భాష చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన విష్ణు, కాజల్ జంటగా నటిస్తున్న ‘మోసగాళ్ళు’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఆ మద్య మంచు విష్ణు 38వ పుట్టిన రోజు సందర్భంగా 'మోసగాళ్లు' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రంలో విష్ణు 'అర్జున్' అనే పాత్రలో కనిపిస్తారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో కాజల్, రుహానీ శర్మ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ మద్య మోసగాళ్ళు చిత్రం నుండి కాజల్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం.
దేశంలో జరిగిన ఒక పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్ర కథాంశం ఉండనుంది. ఐటీ రంగంలో జరిగిన భారీ కుంభకోణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఆ కుంభకోణంలో మోసగాళ్లు ఎవరు? వాళ్లు ఏం చేశారు? అనేది ట్విస్ట్. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది. మంచు విష్ణు నటిస్తున్న చిత్రాలు ఈ మద్య వరుస ఫ్లాపులు అవుతున్నాయి. మరి ఈ చిత్రంతో మంచువారి అబ్బాయి హిట్ కొడతాడా లేదా చూడలి.