వైసిపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు తెలిపిన నటులలో ఒకరు కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రజా సంకల్ప పాదయాత్ర టైములో  అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కష్టపడ్డారు పృథ్వి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక పృథ్వి కష్టాన్ని గుర్తించిన వైయస్ జగన్...శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ పదవిని ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. అయితే వచ్చిన పదవిని కమెడియన్ పృథ్వి అతి తక్కువ టైమ్ లోనే కోల్పోయారు. దానికి కారణం ఆయన నోటి దూల. విషయంలోకి వెళితే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి సంబంధించిన సంస్థలోనే ఒక అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో లిక్ అవ్వటంతో విషయం మొత్తం బయటకు రావడంతో పృద్వి పరువు తో పాటు పార్టీ పరువు కూడా ఆ టైమ్ లో పోయింది.

 

దీంతో హైకమాండ్ ఆదేశించటం ముందే తన చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. ఆ టైంలో అది ఫేక్ ఫోన్ కాల్ అని కావాలని రాజకీయంగా దెబ్బతీయాలని కొంతమంది చేసిందని ఇటీవల పేర్కొన్నాడు. ఈ దెబ్బతో తాను సినిమాపరంగా మరియు రాజకీయ పరంగా చాలా నష్టపోయానని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరున ఏడుస్తూ తన బాధని తెలియజేశాడు.

 

గతంలో తనతోపాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్క ఫోన్ కూడా చేయడం లేదని పట్టించుకోవడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ చూసిన రోజా వెంటనే భావోద్వేగానికి గురై పృద్వి కోసం సినిమా ఆఫర్లు ఇప్పించడానికి రంగంలోకి దిగినట్లు వైసీపీ పార్టీలో టాక్. మరోపక్క ఇండస్ట్రీలో కూడా పృథ్వి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: