టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా పూజ హెగ్డే రష్మిక మందన హవా నడుస్తుంది. వేరే హీరోయిన్లు ఎవరూ లేకపోవడంతో వారి ఇద్దరినే తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాలు అంటే వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి చేతులో చెరో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వీరి రేటు కూడా ఎక్కువగానే ఉన్నా దర్శక నిర్మాతలు మాత్రం ఎక్కడా కూడా వారి విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి కనపడటం లేదనే చెప్పాలి. 

 

ప్రస్తుతం రష్మిక మందన మరీ దూకుడుగా వెళ్తుంది. తెలుగులో తమిళంలో ఆమెకు అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఈ సినిమాల విషయంలో ఆమె ఆచితూచి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. పారితోషికం డిమాండ్ చేయను అని చెప్తూ జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటుంది ఈ కన్నడ హీరోయిన్. ఈమెకు ఇటీవల ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక స్టార్ హీరోతో ఆమెకు నటించే అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపించలేదని, తెలుగు లో సినిమాలు చాలు అనే భావనలో ఉందని అంటున్నారు. 

 

ఆమె ఇటీవల ముంబై వెళ్లి ఒక స్టార్ హీరోని కలవగా తన సినిమాలో నటించమని ఆమెను కోరినట్టు సమాచారం. దీనికి ఆమె అంతగా ఆసక్తి చూపించ లేదు అంటున్నారు. కారణం ఏంటో తెలియదు గాని తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నా అనే భావనలో ఆమె ఉంది. అందుకే ఇతర భాషల్లో ప్రధానంగా బాలీవుడ్ లో తనకు ఆఫర్లు వద్దని స్పష్టంగా చెప్తున్నట్టు సమాచారం. దానికి తోడు అక్కడ చేసినా సరే హీరోయిన్ కి అంత ప్రాధాన్యత ఇవ్వరు అనే భావనలో ఆమె ఉన్నారట. అందుకే అక్కడ వద్దని వచ్చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: