టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తారు. 2004లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా లక్ష్మీ నరసింహా అనే సూపర్‌ హిట్ సినిమాను తెరకెక్కించాడు నిర్మాత బెల్లంకొండ సురేష్‌. ఈ సినిమాతో సరికొత్త రికార్డ్‌ లను నెలకొల్పాలని భావించాడు బాలయ్య. కానీ రికార్డ్ ‌లు సాధించటం సాధ్యం కాలేదు.

 

దీంతో బాలయ్య అసహనానికి గురైనట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయంలో జరిగిన వివాదంలోనే బాలయ్య ఆగ్రహానికి గురైన బెల్లంకొండ సురేష్‌ తో పాటు మరో వ్యక్తి మీద కాల్పులు జరిపినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సంఘటన తరువాత బాలయ్య మీద హత్యా యత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. బెల్లంకొండ కూడా బాలయ్యే తన మీద కాల్పులు జరిపినట్టుగా ముందుగా అంగీకరించాడు. కానీ తరువాత సీన్ మారిపోయింది.

 

బాలయ్య మానసిక పరిస్థితి సరిగా లేదంటూ కొత్త వాదన తెర మీదకు వచ్చింది. సంఘటన జరిగిన తరువాత బాలయ్య ఆసుపత్రిలో చేరాడు. కొద్ది రోజుల తరువాత బెల్లంకొండ సురేష్ మాట మార్చాడు. మూడో వ్యక్తి ఇంట్లో కి ప్రవేశించి తమ మీద కాల్పులు జరిపినట్టుగా సరికొత్త వాదన వినిపించాడు. దీంతో బాలయ్యకు ఊరట దక్కింది.

 

అయితే అదే సమయంలో బాలయ్య భార్య వసుంధర మీద కూడా కేసులు నమోదయ్యాయి. సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించిందంటూ ఆమె మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం జరిగి 15 ఏళ్ల గడుస్తున్నా ఏం జరిగిందన్న విషయంపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: