మొన్న జరిగిన అమీ తుమీ టాస్క్లోనే అమ్మ రాజశేఖర్ మాస్టర్ అర గుండు గీయించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే అంతకుముందు కాసేపు తటపటాయించాడు. ఇంట్లో వాళ్లు నచ్చజెప్పి చూశారు. ‘జుట్టు అంటే మీకు చాలా ఇష్టం. గీయించుకోవద్దు’ అన్నారు. అయినా మాస్టర్ సిద్ధపడ్డాడు. అయితే ఏమైందో కాసేపయ్యాక మళ్లీ కుదరదు అన్నాడు. దీంతో ఆ రోజు ఆ టాస్క్ ఆగిపోయింది. ఇక నిన్న నాగ్ ఆ విషయాన్ని మరోసారి తెర మీదకు తెచ్చాడు. ఇప్పుడు అరగుండు గీయించుకుంటే కెప్టెన్సీ కంటెస్టెంట్ కాదు… వచ్చే వారం నామినేషన్ నుంచి సేఫ్ అని చెప్పాడు.
ఈసారి అమ్మ రాజశేఖర్ మాస్టర్ పెద్దగా ఆలోచించలేదు. ఎవరు చేస్తారు అని నాగ్ మాట పూర్తి చేసిన వెంటనే ‘నేను రెడీ’ అని సిద్ధమయ్యాడు. నాగ్ మాట ప్రకారం నోయల్ ట్రిమ్మింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంటి సభ్యులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో, నాగ్ మరోసారి మాస్టర్ను అడిగాడు. అప్పుడు కూడా మాస్టర్ ఓకే బాబు అనడంతో అర గుండు గీసేశారు. అంతా బాగానే ఉంది. ఆ రోజు గుండు గీసుకోవడానికి ఇష్టపడని మాస్టర్ ఈ రోజు ఎందుకు అంగీకరించినట్లు. ఏమో మరి. అయితే ఆఖరులో దివి వచ్చి… ‘మీ డెసిషన్ మీరు తీసుకోలేరా… నో అని చెప్పలేరా మీరు’ అనేసి వెళ్లిపోయింది.
దీన్ని బట్టి ఆయన హౌస్ లో ఉండటానికి ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు. సింపతీ కోసం చేశాడు. చివర్లో నాగార్జున అడిగాడు నామినేషన్ నుంచి మీరు ఇంకొకళ్ళని సేవ్ చేస్తారా లేకుంటే మీరే సేవ్ అవుతారా అంటే నేనే సేవ్ అవుతా అని చెప్పాడు. కాని ఆడియన్స్ ఎప్పుడెప్పుడు నామినేషన్ లోకి వస్తాడా ఎప్పుడు పంపిద్దామా అని ఎదురు చేస్తున్నారు. అలాగే కొంతమంది నాగార్జున ని సోషల్ మీడియా పరంగా బండ బూతులు తిడుతూ నాగార్జున ఓ పనికి రాని వరస్ట్ హోస్ట్ అంటూ కామెంట్స్ చేస్తూ తెగ మండిపడుతున్నారు.ఇదంతా కావాలనే చేశాడంటూ నాగార్జునని అసభ్యకరంగా తిట్టి పడేస్తున్నారు.