శర్వానంద్ కి కొన్ని రోజులుగా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి.. అయన విజయాన్ని చూసి చాల రోజులే అయిపొయింది.  రాధా,మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం , జాను సినిమా లు దారుణంగా పరాయజం పాలయ్యాయి.. ప్రస్తుతం శ్రీకారం సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఈ మూవీపై శర్వా భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ ని సాధించాలని గట్టి పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. కిషోర్ . బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే తిరుపతిలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయాలని శర్వా డైరెక్టర్ మీద ప్రెజర్ పెట్టి మరీ సినిమా చేస్తున్నాడట.

ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరుకు షెడ్యూల్ అక్కడే షూటింగ్ జరగనుందని టీమ్ చెబుతోంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్లాలనే కసితో శర్వా వున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ శర్వానంద్ కేర్ తీసుకుంటున్నారట. దీంతో కొత్త దర్శకుడు కిషోర్ కి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. చాలా ప్రెషర్ ఫీలవుతున్నాడట.

దీంతో పాటే కీరవాణి అనే చిత్రాన్ని ఒకే చేశాడు శర్వా..కరోనా కారణం గా సినిమా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఇక ఇటీవలే శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది.. rx100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు..మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది.. ఇప్పుడు అదే కథను శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడుఅసలే ఫ్లాప్ లలో ఉన్న శర్వా కి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: