ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ కరోనా టైం లో చాలా మంది సెలెబ్రెటీస్ చనిపోయరు.  ఈ సంవత్సరం చాలా దారుణం అనే చెప్పాలి. ఈ కరోనా అనేక మందిని బలి తీసుకుంది. చాలా మంది చనిపోయారు. కొంతమంది అయితే ఆర్ధికంగా దెబ్బ తిన్నారు. నార్త్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయాడు. ఆయన మరణం తీరని లోటుగా మిగిలిపోయింది. ఇక సౌత్ లో కన్నడ నటుడు చిరంజీవి సర్జా చనిపోయాడు. ఆయన మరణం కూడా తీరని లోటుగా మిగిలిపోయింది.

కన్నడ హీరో చిరంజీవి 36 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అంత చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు.దీంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ మొత్తం షాకయ్యింది. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసాడు చిరంజీవి . అయితే ఆయన పోయే ముందు అతని భార్య మేఘన రాజ్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు ఆమె పట్ల చాలా జాగ్రత్త వహించారు.

కొద్దిరోజుల తరువాత చిరంజీవి సర్జా కటౌట్ పెట్టి.. సీమంతం జరిపించారు. కన్నడ  నటుడు  చిరంజీవి  తమ్ముడైన ధృవ్ .. ఎన్నో సార్లు ‘తన అన్న మళ్ళీ పుడతాడు’ అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. అతను అన్నట్టుగానే మేఘనా రాజ్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. దాంతో కుటుంబ సభ్యులు అలాగే చిరంజీవి  ఫ్యాన్స్ మరియు చిరంజీవి షార్జా సోదరుడు ధృవ్ .. ఎంతో సంతోషపడుతున్నట్టు కామెంట్ చేశారు.


తన అన్నయ్య లేకపోయినప్పటికీ వదిన అయిన మేఘనను తల్లిలా చూసుకుంటానని కూడా ధృవ్ తెలిపాడు. ఇంకో విశేషం ఏమిటంటే..చిరంజీవి , మేఘనా రాజ్ ల ఎంగేజ్మెంట్ డే కూడా ఈరోజే.!

మరింత సమాచారం తెలుసుకోండి: