దేశంలో కరోనా కేసులు తగ్గాయేమో కానీ.. తీవ్రత తగ్గలేదు. సామాన్యుడి నుంచి ప్రభుత్వం వరకూ చెప్తున్న మాట ఇదే. ఇప్పటికీ ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలతోనే ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. టాలీవుడ్ లో షూటింగ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమా షూటింగ్ దశలో ఉంది. కానీ.. యూనిట్ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకి షూటింగ్ క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై చిత్ర దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు.
టక్ జగదీశ్ సెట్లో పని చేస్తున్న టెక్నీషియన్ కు కరోనా సోకిందనే వార్తలు టాలీవుడ్ లో గుప్పుమన్నాయి. దీంతో హీరో, దర్శకుడితోపాటు సభ్యులంతా క్వారంటైన్ కు వెళ్లిపోయారని.. షూటింగ్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. దీనిపై శివ నిర్వాణ స్పందించాడు. 38వ రోజు సినిమా షూటింగ్ జరుగుతోంది. నాని.. టక్ జగదీశ్ ను ఆపేది లేదు.. అంటూ ఓ క్యాప్షన్ ఇస్తూ.. ఇందుకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో షూటింగ్ స్పాట్ లో శానిటైజేషన్ చేస్తున్న తీరును చూపించాడు. దీంతో.. సినిమా షూటింగ్ అన్ని జాగ్రత్తలతో జరుగుతోందని చెప్పుకొచ్చాడు.
నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి సినిమాతోనే శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. శివ నిర్వాణ రెండో  సినిమా మజిలీ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో శివ నిర్వాణ మూడో సినిమా టక్ జగదీష్ పై అంచానాలు ఎక్కువగానే ఉన్నాయి. సినిమాలో హీరోయిన్లుగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: