ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..హాట్ బ్యూటీ తాప్సి పన్ను తెలుగులో పలు చిత్రాలలో నటించి గుర్తింపు  దక్కించుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో అక్కడికి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ వరుస విజయాలతో దూసుకుపోతుంది.మంచి మంచి కథలని చేస్తూ పేరు తెచ్చుకుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టేసి కథకు  ప్రాధాన్యమున్న పాత్రలను  ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ  సక్సెస్ రేట్ ను పెంచుకుంటోంది.‘ఝుమ్మందినాదం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.


దీంతో టాలీవుడ్‌కు గుడ్‌ బై చెప్పేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ రెండు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. తాజాగా ‘రష్మీ రాకెట్’ సినిమాలో అథ్లెట్‌గా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్‌ని తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.అయితే ఈ పోస్టర్‌పై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే అసభ్య పదజాలంతో కామెంట్ చేయడంతో తాప్సీకి కోపమొచ్చింది.



‘నీకు నటన రాదు. మంచి కథలు ఎంచుకుంటూనే వాటిని నాశనం చేస్తున్నావ్. ఫాల్తు హీరోయిన్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై ఘాటుగా స్పందించిన తాప్సీ.. ‘నేను సరికొత్త ప్రమాణాలను సృష్టించాను. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.ఇలాంటి మరెన్నో ఆసక్తి కరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మరింత సమాచారం తెలుసుకోండి: