ఈ కారణంతోనే ఏ సినిమా నిర్మాతగానీ, డిస్ట్రిబ్యూటర్లుగానీ సినిమాల విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇటువంటి తరుణంలో హీరో సుమంత్ తన సినిమా 'కపటధారి' విడుదల తేదీని ప్రకటించారు. ఇదే వరుసలో ఇప్పుడు మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు. తన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర విడుదల తేదీని సాయితేజ్ వెల్లడించారు.
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బెటరే సో బెటర్’. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో సహకారంతో ఈ క్రిస్ట్మస్ నాటికి విడుదల చేస్తున్నారు. దీనిలో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. థమన్ సంగీత అందిస్తున్నాడు.
సినిమా విడుదల గురించి సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడాడు. ‘‘ఇన్ని రోజులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాం. అందుకే క్రిస్ట్మస్కు అందర్నీ నవ్వించడానికి, అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాతో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్తో సిద్ధమయ్యాం. డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం’’ అని చెప్పారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించామని, ఈ నిర్ణయం చాలా ఎగ్జయిటింగ్గా ఉందని చెప్పారు. తమ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.