మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ఇద్దరి కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రాం చరణ్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. చిరు, రాం చరణ్ ఇద్దరు అదరగొట్టేస్తారని తెలుస్తుంది. సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో చరణ్ తో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది కన్నడ భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో వరుస స్టార్ అవకాశాలను అందుకుంటుంది. ఆచార్య సినిమాలో రష్మిక సెకండ్ లీడ్ గా చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రష్మిక గురించి చిత్రయూనిట్ దాచేస్తున్నారు. అది ఎందుకు ఏమిటి అన్నది తెలియదు కాని రష్మిక పాత్ర చాలా స్పెషల్ గా డిజై చేస్తున్నారట కొరటాల శివ.

కాజల్ తో పాటుగా రష్మిక ఒక హీరోయిన్ అని అంటున్నా సినిమాలో ఆమె చేసేది 10 నిమిషాల పాత్ర అని తెలుస్తుంది. రష్మిక ఈ సినిమాలో కొత్త పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఆచార్య మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. సోషల్ మెసేజ్ తో పాటుగా సినిమా ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో ఆచార్య వస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: